నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:57

టెలిగ్రామ్ లో డేటింగ్ పేరుతో 30 లక్షల సైబర్ మోసం..

హైదరాబాద్ ఎస్సార్ నగర్ కి చెందిన ఓ వ్యక్తి..టెలిగ్రామ్ లో కాల్ గర్ల్ సర్వీస్ బుక్ చేసుకున్న బాధితుడు.

సర్వీస్ తో పాటు వివిధ ఛార్జీల పేరుతో 15 లక్షలు కాజేసిన చీటర్స్..

అనంతరం డబ్బులు రిటర్న్ అడగడంతో.. రిఫండ్ పేరుతో పలు దఫాలుగా మరో 15 లక్షలు కాజేసిన చీటర్స్..

మొత్తం 30 లక్షలు కాజేసిన..సైబర్ చీటర్స్..

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:48

Aadhaar Card: ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త..!

ప్రస్తుతం మనకుండే డాక్యుమెంట్లలో కీలకమైనది ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పని జరగదు. అలాగే ప్రతి ఒక్కరికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడి కార్డు, రేషన్‌ కార్డు.. వంటి కార్డులు కూడా ముఖ్యమైనవే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌ అందించబోతోంది. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్రం అదిరిపోయే సరికొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సేవ ద్వారా ప్రజలకు ఎంతో ఊరట కలుగనుంది. చాలా మందికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటర్‌ ఐడికార్డు, రేషన్‌ కార్డు వంటివి ఉంటాయి. ఇవి కీలకమైన డాక్యుమెంట్లు. చాలా మందికి ఆధార్‌లో ఒక అడ్రస్‌ ఉంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఓటర్ ఐడి కార్డులలో మరో అడ్రస్‌ ఉంటుంది.

ఈ డాక్యుమెంట్లలో వేర్వేరు వివరాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో అన్ని డాక్యుమెంట్లలో వివరాలు సరి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాటన్నింటికి వేర్వేరు కార్యాలయాలు, మీ సేవకు కేంద్రాలకు వెళ్లి సరి చేసుకోవాల్సి పరిస్థితి ఉంటుంది. కొన్నింటి డాక్యుమెంట్లలకు వివరాలు సరి చేసుకోవాలంటే అసలు ఆప్షనే లేదు. ఇలా పత్రాలన్నింటిలో వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కష్టమైన పనే. ఎందుకంటే వివరాలను మార్చుకోవడానికి ఒక్కో డాక్యుమెంట్ కోసం ఒక్కో చోటుకు వెళ్లాల్సి ఉంటుంది.

అందుకే ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రానున్న రోజుల్లో డాక్యుమెంట్లలో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలంటే మరింత సులభతరం కానుంది. కేంద్రం తీసుకువచ్చే కొత్త సర్వీసులతో ఈ పని సులభం కానుంది.

ఈ నేపథ్యంలో కేంద్రం కొత్ల ప్లాట్‌ఫామ్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కొత్త సిస్టిమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ఆధార్‌లోని ఏవైనా మార్పులు ఉంటే ఆ మార్పులన్ని కూడా ఆటోమేటిక్‌గా ఇతర డాక్యుమెంట్లలో కూడా అప్‌డేట్‌ అవుతాయి. మీరు మీ ఆధార్‌ కార్డులో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేస్తే ఆ వివరాలు ఓటర్‌ ఐడి, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల్లో కూడా అప్‌డేట్‌ అవుతాయి. అది జరిగితే కనుక అన్ని డాక్యుమెంట్లలో ఒకే విధమైన వివరాలు ఉంటాయి.

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఈ కొత్త సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ట్రాన్స్‌పోర్ట్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీ రాజ్‌, ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి వాటిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐటీ శాఖ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి కీలకమైన పత్రాలను జారీ చేసే డిపార్ట్‌మెంట్లతో చర్చించనుంది. తర్వాత పాస్‌పోర్టు వంటి ఇతర డాక్యుమెంట్లకు ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఏదీ ఏమైనా ఈ సర్వీసు కనుక అందుబాటులోకి వస్తే దేశ ప్రజలకు శుభవార్తేనని చెప్పాలి.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:35

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది.

దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ కెమెరాలను అమర్చాలంది. ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది.

పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది. పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:23

Viveka Murder Case: మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి..

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు..

విచారణలో భాగంగా.. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నేడు విచారణకు రానున్న ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ కానున్నారు.

మరోవైపు ఈకేసులో చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డితో పాటు గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 10:52

Women's Bill : ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభం .. BRS శ్రేణులతో కోలాహలంగా జంతర్ మంతర్‌

RS for Women's Bill : మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ... బీఆర్ఎస్ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రారంభించింది..

ఇందులో భాగంగా... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఉదయం 10.15కి జంతర్ మంతర్‌ ప్రాంగణంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆమె... ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందనీ.. ఇప్పటివరకూ అలా జరగట్లేదని.. బీఆర్ఎస్ చెబుతోంది.

భారత జాగృతి సంస్థ ఈ దీక్షను నిర్వహిస్తోంది. దీనికి సీపీఐ , సీపీఎంతోపాటూ... ఎన్సీపీ , టీఎంసీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే , ఆప్ , నేషనల్‌ కాన్ఫరెన్స్, శివసేన , పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి..

సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. సీపీఐ కార్యదర్శి డి.రాజా... ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమింపజేస్తారని తెలిసింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు, మహిళా మంత్రులు, కార్యకర్తలతోపాటూ... 29 రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న వారు కూడా పాల్గొన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 07:42

కేసీఆర్ ముందస్తు నగారా!?

కవిత విచారణతోనే ముడిపడిందా..?

ఊహించని వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తాకొట్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు మరో మాస్టర్ స్ట్రోక్‌కు సిద్ధమయ్యారా?... ముందస్తు ఎన్నికల వ్యూహంతో విపక్ష నేతలను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారా?... 2019 మాదిరిగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు సీన్‌ను రిపీట్ చేయబోతున్నారా?... ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవిత అరెస్టైతే ఎన్నికల నగారా మోగించడం ఖాయమా?... ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ కవిత విచారణ, అరెస్ట్ కూడా చేయొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ అంశాలే హాట్ టాపిక్‌గా మారాయి. ఒక్కసారిగా ముందస్తు ఊహాగానాలు గుప్పుమన్నాయి. మరి సీఎం కేసీఆర్ నిజంగా ముందస్తుకు వెళ్తారా?. సడెన్‌గా ఈ ప్రచారానికి కారణాలు ఏమిటో ఒక లుక్కేద్దాం...

నిజానికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని రెండో దఫా సర్కార్ ముందస్తుకు వెళ్లబోతోందంటూ చాలాసార్లు జోరుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం మీటింగ్’ సమయంలోనూ కొంతకాలం ఇదే ప్రచారం నడిచింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ, అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది.

సీఎం కేసీఆర్ గురువారం హఠాత్తుగా క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారమే బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే సానుకూల ప్రభావం ఉంటుందని, అందుకు తగిన సమయం ఇదేననేది విశ్లేషణలు, ఊహాగానాల సారాంశం.

కవిత అరెస్ట్‌తో సానుభూతి వస్తుందా?

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించాయి. వేర్వేరు కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండి ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా నేతల విమర్శలు, ప్రతివిమర్శలు సైతం పదునెక్కాయి. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రంలోని అధికార పార్టీలైన బీజేపీ (BJP), బీఆర్ఎస్‌ల (BRS) మధ్య నువ్వా-నేనా అనే రీతిలో మాటల యుద్ధం (Words war) కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవితపై ఆరోపణలు వచ్చాక ఈ రాజకీయ వాతావరణం మరింత రంజుగా మారింది. తాజాగా కవితకు ఈడీ నోటీసులు, అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం మధ్య ఈ పరిస్థితి హీటెక్కింది. బీజేపీని ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేంద్రం కక్షకట్టిందని... ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇబ్బంది పెడుతున్నారని ఒకింత ప్రచారం ఉంది కాబట్టి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైతే జనాల్లో బీఆర్ఎస్‌కు సానుభూతి వస్తుందా? అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి కవిత అరెస్ట్‌ బీఆర్ఎస్‌కి సానుకూలమా? ప్రతికూలమా? అనే చర్చ పక్కనపెడితే ఈ అంశమే ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ, శుక్రవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఈ చర్చకు ఆజ్యం పోశాయనే చెప్పాలి. కవిత అరెస్ట్ అయితే ఎలా వ్యవహారించాలనే అంశంపైనే బీఆర్ఎస్ చర్చించబోతోందని స్పష్టమైన సంకేతాలు రావడం.. మరోపక్క జిల్లా స్థాయి నేతలు సైతం విస్తృత స్థాయి సమావేశానికి హాజరవ్వాలంటూ సమాచారం అందివ్వడం ముందస్తు చర్చకు బలం చేకూర్చాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.

నిజంనిప్పులాంటిది

Mar 09 2023, 17:38

కోమటిరెడ్డి ది బావోద్వేగం కాదు అగ్రకుల అహంకారమే..

•రాష్ట్ర వ్యాప్తంగా అంధోళనలు నిర్వహిస్తం..

•తీగల ప్రదీప్ గౌడ్ ఎం.ఎస్పి రాష్ట్ర అధ్యక్షులు

చెరుకు సుధాకర్ ని పార్టీలకతీతంగా ఉధ్యమకారునిగా బహుజన వర్గాలకు చెందిన నాయకునిగా సమాజం చూస్తుందన్నారు...సుధాకర్ ను పార్టీ గా ఏనాడు తెలంగాణ సామాజిక శక్తులు చూడలేదు అన్నారు..సామాజిక శక్తి గా మాత్రమే చూస్తాయి అన్నారు.

గురువారం నల్లగొండ పట్టణంలో ని నవ్య హస్పిటల్ లో డాక్టర్ చెరుకు సుధాకర్ కు వారి కుమారునికి మహజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి,

బిసి సంక్షేమ సంఘం, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం,మాల మహానాడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన సంఘం, తెలంగాణ స్టూడెంట్ యూనియన్, తెలంగాణ గౌడ సంఘం, మున్నూరు కాపు సంఘం, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్వర్యంలో సంఘీభావం ప్రకటించి విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా తీగల ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు బావోద్వేగంతో మాట్లాడిన మాటలు కావు అగ్రకుల అహంకారం తో మాట్లాడిన మాటలుగానే మహజన సోషలి పార్టీ, ఎంఆర్పిఎస్ చూస్తుంధన్నారు.చెరుకు సుధాకర్ కుటుంభాన్ని అంతం చేయడం బావోద్వేగమవుతుంధా అని ప్రశ్నించారు.ఎదుగుతున్న బహుజన నాయకుని అణగదొక్కడానికి కుల అహంకారం తో బెదిరించిన మాటలుగానే చూస్తాం అన్నారు.

విధానపరంగా మాత్రమే చెరుకు సుధాకర్ మాట్లాడినాడు తప్ప వెంకట్ రెడ్డి లాగా ఏనాడు వ్యక్తిగత దూషణలకు దిగలేదు అన్నారు.నల్లగొండ లో ఎస్సి.ఎస్టి.బిసిల ప్రైవేటు దావాఖానాలు ఉండొద్దా.! ఉంటే

కూల్చేస్తారా..! ఆధిపత్య వర్గాలు మాత్రమే హస్పిటల్స్ మాత్రమే బతకాలా అన్నారు.

మీరు మాత్రం వంంధల కోట్ల కాంట్రాక్టు లు,ఆస్థులు కూడబెట్టుకోవొచ్చు..

మేము మాత్రం ఎదుగొద్దా..

మా దళిత నాయకుడు అద్దంకి దయాకర్ చే రెండుసార్లు క్షమాపణ చెప్పించుకున్నరు..

కాని మా చెరుకు సుధాకర్ కు వెంకట్ రెడ్డి క్షమాపణ ఎంధుకు చెప్పలే..?

తక్షణమే వెంకట్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం..

సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో బహుజనులకు స్థానం లేనట్లుగానే భావిస్తాం అన్నారు..ఈ రోజు తెలంగాణ లో ఎస్సీ.ఎస్టి.బి.సి సంఘాలు సుధాకర్ కు వెన్నుదన్నుగా నిలబడ్డాయి అన్నారు..తెలంగాణ లో వారికున్న శక్తి అది అన్నారు.

చెరుకు సుధాకర్ జైల్లో నిర్భంధించబడితే రాష్ట్ర వ్యాప్తంగా మంధక్రిష్ణ మాదిగ ఉధ్యమాన్ని నిర్మించినడు.కోమటిరెడ్డి ఏనాడు ఉధ్యమంలో చెరుకు సుధాకర్ కు అండగా నిలబడలేదు అన్నారు.వెంకట్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం అణగారిన వర్గాలను తొక్కడమే పనిగా పెట్టుకున్నాడన్నారు.మా వర్గాలను ఎదుగుతున్న సుధాకర్ ను బౌతికంగా అంతం చేయడానికి వెంకట్ రెడ్డి ప్లాన్ ను చిత్తు చేస్తాం అన్నారు. ప్రభుత్వం కూడా చెరుకు కుటుంభానికి రక్షణ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలతో అగ్గి రాజేస్తామన్నారు.

ఆధిపత్య అహంభావాన్ని బరించం..

'ఉత్తమ్' స్పందించాలి....

డా:చెరుకు సుధాకర్ టిపిసిసీ ఉపాధ్యక్షులు

మా కుటుంబం 40 ఏండ్లుగా అనేక కష్టాలను చూసిందన్నారు.నా జీవితంలో ఏనాడు ఇలాంటి మాటలు పడాల్సి వస్తదని కళలలో కూడ ఊహించలేదు అన్నారు.పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నా కుమారుని,నన్ను తిట్టిన తీరు కన్న తల్లి ని అవమానపర్చడమే అన్నారు.ఇలాంటి అనైతిక మాటలు మాట్లాడి న్యాయస్థానం పై గౌరవం ఉంధని మాట్లాడుతుంటే సమాజం సిగ్గు పడుతుంది అన్నారు.ఇవాళ పున్నా కైలాష్ నేతను బెదిరిస్తున్నవారు ఏ పార్టీ లో ఉన్నరు అన్నారు.మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కోసం ఓట్ల కోసం డబ్బులు పంచింది మీరు కాధా అన్నారు.సోనియాగాంధీ సాధికారత కోసం తెలంగాణ ఇస్తే..పాలేగాండ్ల గా బి.సి,ఎస్సి ఎస్టీ ల ను చూస్తున్నారన్నారు.

నీ క్షమాపణ అవసరం లేదు..నీ ప్రవర్తన మార్చుకో..నీకు కోర్టు ల మీద గౌరవం ఉంటే రాజ్యంగం మీద గౌరవం ఉంటే గిట్లనేనా మాట్లాడేది.ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నడు కాబట్టి స్పందించాలి.ఉత్తమ్ ను వెంకట్ రెడ్డి తిడితే మమ్ములను బాదించింది.కోమటిరెడ్డి కి పాశ్చాతపం లేదు.ఏనాడు వారి వ్యాఖ్యలను పున:పరీశీలన చేసుకోలేదు.పార్టీ కి అక్కరొచ్చే పని చేయమంటే..కాళ్లల కట్టెలు పెడుతున్నడు.వెంకట్ రెడ్డి నిన్నే కాదు నా జీవితంలో ఏనాడు వ్యక్తిగతంగా ఎవరి ని దూషించలేదు.నిరూపిస్తే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తా అన్నారు.ఆధిపత్య అహంభావంతో పోతే బహుజనులు బరించడానికి సిద్దంగా లేరు.ఎవరు ఇట్లా మాట్లాడినా బరించడానికి సిద్దంగా లేము.

వెంకట్ రెడ్డి నువ్వు కార్యకర్త గా ఉన్నప్పుడే 1991 లోనే మిర్యాలగూడ ఎంపిగా పోటి చేసి 50,000 ఓట్లు తెచ్చుకున్నాను అన్నాడు.ఇవాళ నువ్వు నా రాజకీయ జీవితాన్ని గురించి మాట్లడతవా.! అని నిలదీసారు.మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెపుతారన్నారు. ఎప్పుడు జిందాబాద్ లో కొట్టి జెండాలు మోస్తరనుకోవడంన నీ అవివేకం అన్నారు.

బహుజనుల అణగదొక్కుతున్న చరిత్ర వెంకట్ రెడ్డి ది..

తండు సైదులు గౌడ్ మాజీ జడ్పిటిసీ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నీది బహుజనలను అణగదొక్కుతున్న చరిత్ర అన్నాడు. నల్లగొండ గడియారం వద్ద చర్చకు రా.. ఏ బహుజన నాయకుని ఎదగనిచ్చినివో చర్చిద్దాం అన్నాడు.నల్లగొండ నియోజకవర్గంలో ,నల్లగొండ జిల్లాలో ఏనాడు ఏ బహుజన వర్గాలను ఎదగనీయలే.నీవు బహుజన వర్గాలను,అర్థికంగా ఎదగనీయలే. నీ కుటుంబం, నువ్వే బాగుపడ్డవు వెంకట్ రెడ్డి అన్నాడు.రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో బూడిద బిక్షమయ్య గౌడ్,సుంకరి మల్లేశ్ గౌడ్,పుల్లెంల వెంకట్ నారాయణ గౌడ్ లాంటి అనేకమంది ని అణగదొక్కినడు అన్నారు.నీతి నిజాయితీ లేని దుర్మార్గుడు వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాలుగు సార్లు ఏమ్యేలే ఐనవు,మంత్రి ఐనవు,ఎంపి ఐనవు అలాంటి పార్టీ ని ఆగం చేయాలని చూస్తున్నవు ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారు అన్నారు. మరోసారి బహుజనుల జోలికొస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ పర్యటించినా మా ప్రతాపం చూపిస్తామన్నాడు.

కోమటిరెడ్డి విధానం సరికాదు..

కొండేటి మల్లయ్య టిపిసిసీ జనరల్ సెక్రటరీ

చెరుకు సుధాకర్ పై వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.కోమటిరెడ్డి విధానంతో ఎస్సి.ఎస్టీ. బిసిల మధ్య ఇబ్బంది సృష్టిస్తున్నాడు అన్నారు.అనేక గ్రూపులు తయారుచేసి పంచాయతీ లకు తెరలేపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి విధానం సరిగ్గా లేదన్నారు.

గౌడుల పై కోమటిరెడ్డి ది కక్షపూరిత చర్య

నకేరకంటి కాశయ్య గౌడ్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు

గౌడుల పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కక్షపూరిత చర్యని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నకేరేకంటి కాశయ్య గౌడ్ అన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రజలలో ప్రాధాన్యత లేకుండాపోయింధన్నారు.వెంకట్ రెడ్డి మతస్థిమితం కొల్పోయి మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ రోజు సభ్య సమాజం వెంకట్ రెడ్డి ని ఈసడించుకుంటుంది అన్నారు. తక్షణమే పార్లమెంట్ సభ్యత్వం నుండి తొలగించాలన్నారు.

వెంకట్ రెడ్డికి రాజకీయ సమాధి కడతం

తలమల్ల హసేన్ మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు

చెరుకు సుధాకర్ ఉధ్యమ సూర్యుడు అన్నారు.వెంకట్ రెడ్డి ఏమి చదువుకున్నడో తెల్వుదు గాని..సుధాకర్ మాత్రం ఒక డాక్టర్ వృత్తి లో ఉన్నడు.అలాంటి వారిపట్ల దుర్భాషలాడటం వెంకట్ రెడ్డి పిచ్చితనానికి నిదర్శనం అన్నారు.

వెంకట్ రెడ్డి ఒక ఉగ్రవాది లాగా వ్యవహరిస్తున్నడు అన్నారు.

మీరు అధికారం కోసం నిరంతరం ఆరాటపడేవారు.కాని చెరుకు సుధాకర్ ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి అన్నారు. కోమటిరెడ్డి నువ్వు ఇట్లనే మాట్లాడితే రాజకీయ సమాధి చేస్తం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం.ఎస్పి నల్లగొండ జిల్లా ఇంచార్జి ఆడెపు నాగార్జున,ఎం.ఎస్పి సూర్యాపేట జిల్లా ఇంచార్జి యాతాకుల రాజయ్య, ఎం.ఎస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్ కనగల్ మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్, సామాజిక కార్యకర్త పలస యాదగిరి, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి,కొమిరే స్వామి, బొజ్జ చిన్న, మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, కారింగ్ నరేష్ గౌడ్ కొంపెల్లి రామన్న గౌడ్ బొజ్జ దేవయ్య ఎరుకల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 09 2023, 15:37

రాహుల్ గాంధీపై రాజస్థాన్ కేబినెట్ మంత్రి కుమారుడి ఘాటైన వ్యాఖ్య

బ్రిటన్‌ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ వైపు విదేశాలకు వెళ్లి దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రకటనలు చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ.. మరోవైపు ఇప్పుడు సొంత వాళ్లే చుట్టుముట్టారు.. వచ్చారు.. రాజస్థాన్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి విశ్వేంద్ర సింగ్, కుమారుడు అనిరుధ్ సింగ్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. బహుశా వేరే దేశానికి చెందిన పార్లమెంట్‌కు వెళ్లి భారత్‌ను అవమానించే పిచ్చివాడిలా తయారయ్యాడని ట్విట్టర్‌లో రాశాడు. రాహుల్ గాంధీకి అనిరుధ్ కూడా ఇటలీని తన మాతృభూమిగా భావిస్తున్నట్లు రాశాడు.

లండన్‌లోని బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ గ్రాండ్ కమిటీ రూమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ను ఉటంకిస్తూ ఓ వార్తాకథనాన్ని ట్యాగ్ చేస్తూ.. 'మా పార్లమెంట్‌లోని మైక్‌లు సైలెంట్‌గా ఉన్నాయి' అని అనిరుధ్ ట్వీట్ చేశాడు.రాహుల్ గాంధీ ఇలా మాట్లాడి ఆత్మవిశ్వాసం పెంచుకున్నారా, తమను అవమానించే వారు. మరొక దేశం యొక్క పార్లమెంటులో దేశం. బహుశా అతను ఇటలీని తన మాతృభూమిగా పరిగణించవచ్చు.

సచిన్ పైలట్‌కి అనిరుధ్ సన్నిహితుడు.

మంత్రి విశ్వేంద్ర సింగ్ కుమారుడు అనిరుధ్ సింగ్ తరచుగా వివాదాల్లో ఉంటాడు మరియు అతను సచిన్ పైలట్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తాడని మీకు తెలియజేద్దాం.సచిన్ పైలట్‌కు మద్దతుగా బహిరంగంగా మాట్లాడడమే కాకుండా, ఆయనను సీఎం చేయడానికి సోషల్ మీడియాలో లాబీయింగ్ కూడా చేస్తున్నాడు.

అనిరుధ్ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేశాడు

అనిరుధ్ సింగ్ ఒక విషయంలో వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. మీడియా కథనాల ప్రకారం, అనిరుధ్ తన తండ్రితో అస్సలు కలిసి ఉండడు. మే 2021లో, అనిరుధ్ తన తండ్రి తన తల్లి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించాడని ఆరోపించాడు. తన తండ్రి మద్యానికి బానిస అని అనిరుధ్ కూడా చెప్పాడు. విశ్వేంద్ర సింగ్‌ను ఆరోపిస్తూ, అనిరుధ్ మాట్లాడుతూ, నేను 6 వారాలుగా మా నాన్నతో కాంటాక్ట్‌లో లేను. అతను మా అమ్మపై హింసాత్మకంగా మారాడు, మద్యం సేవించడం ప్రారంభించాడు మరియు నా స్నేహితుల వ్యాపారాన్ని కూడా నాశనం చేశాడు. ఇది కేవలం రాజకీయ సిద్ధాంతాల తేడా కాదు.

నిజంనిప్పులాంటిది

Mar 09 2023, 15:14

MLC Kavitha: దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు అనుమతి నిరాకరణ

•ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడెలా రద్దు చేస్తారని కవిత ఆగ్రహం

దిల్లీ: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమతి రద్దు చేస్తున్నట్లు కవితకు పోలీసులు తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతుండగానే సమాచారం అందించారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎలా రద్దు చేస్తారని కవిత ప్రశ్నించారు.

తమ దీక్షలో మార్పు లేదని.. యథావిధిగా నిరసన కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనిపై దిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Mar 09 2023, 13:55

TDP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థిని దించే యోచనలో తెదేపా!

అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేసేందుకు తెదేపా(TDP) సిద్ధమవుతోంది. అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది..

ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని నిలిపే అంశంపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైకాపాకు మద్దతు ప్రకటించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్‌ జారీ చేయాలని తెదేపా భావిస్తోంది. ఆయా ఎమ్మెల్యేలు విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే విప్‌ను ఉల్లంఘిస్తే ఆయా ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని తెదేపా భావిస్తోంది..